బియ్యపుతిప్పలో నిపుణుల బృందం పర్యటన

ABN , First Publish Date - 2020-11-25T05:05:28+05:30 IST

ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుకు బియ్యపుతిప్పలో సేకరించిన 350 ఎకరాల స్థలాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన ఏడుగురు సభ్యుల నిపుణుల బృందం పరిశీలించింది.

బియ్యపుతిప్పలో నిపుణుల బృందం పర్యటన
ఆక్వా యూనివర్సిటీ స్థలాన్ని పరిశీలిస్తున్న నిపుణుల బృందం

నరసాపురం రూరల్‌, నవంబరు 24 : ఆక్వా యూనివర్సిటీ  ఏర్పాటుకు బియ్యపుతిప్పలో సేకరించిన 350 ఎకరాల స్థలాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన ఏడుగురు సభ్యుల నిపుణుల బృందం పరిశీలించింది. విశాంక్‌ కపూర్‌ నేతృత్వంలోని ఈ బృందం వేములదీవి, చినలంక గ్రామాల్లోనూ పర్యటిం చింది. గోదావరి, సముద్రం కలిసే ప్రదేశంపై ఆరా తీశారు. రెండు గంటలపాటు ఈ బృందం పలు విష యా లపై అధ్యయనం చేసింది. బృందం వెంట డిప్యూటీ తహీ సల్దార్‌ బీఎస్‌ కందుల, సర్వేయర్‌ కుమార్‌లు ఉన్నారు. 


Updated Date - 2020-11-25T05:05:28+05:30 IST