బియ్యపుతిప్పలో నిపుణుల బృందం పర్యటన
ABN , First Publish Date - 2020-11-25T05:05:28+05:30 IST
ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుకు బియ్యపుతిప్పలో సేకరించిన 350 ఎకరాల స్థలాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన ఏడుగురు సభ్యుల నిపుణుల బృందం పరిశీలించింది.
నరసాపురం రూరల్, నవంబరు 24 : ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుకు బియ్యపుతిప్పలో సేకరించిన 350 ఎకరాల స్థలాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన ఏడుగురు సభ్యుల నిపుణుల బృందం పరిశీలించింది. విశాంక్ కపూర్ నేతృత్వంలోని ఈ బృందం వేములదీవి, చినలంక గ్రామాల్లోనూ పర్యటిం చింది. గోదావరి, సముద్రం కలిసే ప్రదేశంపై ఆరా తీశారు. రెండు గంటలపాటు ఈ బృందం పలు విష యా లపై అధ్యయనం చేసింది. బృందం వెంట డిప్యూటీ తహీ సల్దార్ బీఎస్ కందుల, సర్వేయర్ కుమార్లు ఉన్నారు.