ఆక్వా డీలర్లు లైసెన్సులు పొందాలి
ABN , First Publish Date - 2022-01-22T04:31:19+05:30 IST
అప్సాద చట్టం ప్రకారం ఆక్వా వ్యాపారులు, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు, డీలర్లు నెలాఖరులోగా లైసెన్సు పొందాలని మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు(జేడీ) నాగేశ్వరరావు సూచించారు.
మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు
నెల్లూరు, (వ్యవసాయం), జనవరి 21 : అప్సాద చట్టం ప్రకారం ఆక్వా వ్యాపారులు, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు, డీలర్లు నెలాఖరులోగా లైసెన్సు పొందాలని మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు(జేడీ) నాగేశ్వరరావు సూచించారు. నెల్లూరు భక్తవత్సలనగర్లోని మత్స్యశాఖ కార్యాలయంలో శుక్రవారం ఆయన ఆక్వా డీలర్లతో సమావేశం నిర్వహించారు. రొయ్యలు, చేపల మేతలు అవసరమైన రైతులు ఆర్బీకేల ద్వారా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఆక్వా రైతులకు అవగాహన కల్పించి వారు కూడా లైసెన్సులు పొందేలా చూడాలన్నారు. ఆక్వా కెమికల్ డీలర్లు ధ్రువీకరణ పొందిన ఉత్పత్తులు మాత్రమే అమ్మాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఎఫ్ ప్రసాద్, డీడీఎఫ్ శ్రీనివాసనాయక్, ఎఫ్డీవో సంజయ్ స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు.