జర్నలిస్టులకు అండగా ఉండాలి: ఏపీయూడబ్ల్యూజే
ABN , First Publish Date - 2020-07-14T08:34:03+05:30 IST
జర్నలిస్టులకు అండగా ఉండాలి: ఏపీయూడబ్ల్యూజే
ఒంగోలు, జూలై 13 (ఆంధ్రజ్యోతి): కరోనా ఆపత్కాలంలో జర్నలిస్టులకు అవసరమైన సహాయక చర్యలను ప్రభుత్వం చేపట్టకపోతే ఉద్యమిస్తామని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు హెచ్చరించారు. ప్రతి జర్నలిస్టుకూ రూ. 50లక్షల బీమా సౌకర్యం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కరోనాతో తిరుపతిలో మృతిచెందిన వీడియో జర్నలిస్టు పార్థసారథి సంతాప సభ ఒంగోలులో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఐవీ మాట్లాడుతూ పార్థసారథి కుటుంబానికి తక్షణం రూ. 50లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.