టీచర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-04-21T05:22:30+05:30 IST
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బౌడు గంగరాజు డిమాండ్ చేశారు.
- ఏపీటీఫ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
చింతపల్లి: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బౌడు గంగరాజు డిమాండ్ చేశారు. మంగళవారం జీకేవీధి, చింతపల్లి మండలాల ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ను రద్దుచేస్తానని చెప్పిన సీఎం జగన్... రెండేళ్లయినా రద్దు చేయలేదన్నారు. ఖాళీగా వున్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, టీచర్లకు బోధనేతర పనులు అప్పగించవద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రెడ్డి వెంకటేశ్వర్లు, కాగి సోమలింగం, అడపా లక్ష్మణరావు, సొలబం సింహాచలంనాయుడు, లోచలి చిట్టినాయుడు, కిట్లంగి పెద్దబ్బాయి, దేపూరి శశికుమార్, తదితరులు పాల్గొన్నారు.