ఆర్టీసీ ఉద్యోగుల ఘరానా మోసం

ABN , First Publish Date - 2020-07-09T03:00:07+05:30 IST

విద్యాధరపురం డిపోకి చెందిన ఇద్దరు ఉద్యోగులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ బాధితులను మోసం చేశారు. నకిలీ ఉద్యోగ నియామక

ఆర్టీసీ ఉద్యోగుల ఘరానా మోసం

విజయవాడ: విద్యాధరపురం డిపోకి చెందిన ఇద్దరు ఉద్యోగులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ బాధితులను మోసం చేశారు. నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు, నకిలీ ఐడీ కార్డులు చూపించి మరీ బాధితులకు టోకరా పెట్టారు. వివరాల్లోకెళితే.. రవికుమార్, వీరంకి బ్రహ్మారావు లు విద్యాధరపురం ఆర్టీసీ డిపోలో పని చేస్తున్నారు. కొందరు వ్యక్తులకు ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేశారు. అలా మొత్తం రూ. 15 లక్షల 50వేలు వసూలు చేశారు. కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని నిందితులు మోసానికి పాల్పడుతున్నారు. అయితే మోసాన్ని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-07-09T03:00:07+05:30 IST