ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ బదిలీ

ABN , First Publish Date - 2020-07-11T13:45:17+05:30 IST

ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ బదిలీ

ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ బదిలీ

అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ బదిలీ అయ్యారు. రవాణాశాఖ కార్యదర్శి కృష్ణబాబుకి ఆర్టీసీ వీసీ అండ్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  వివాదాస్పద నిర్ణయాలతో ఆర్టీసీకి నష్టం కలిగించడంతోపాటు ఇటు సిబ్బందిని, అటు ప్రభుత్వాన్నీ ఇరుకున పెట్టేలా వ్యవహరించడంతో మాదిరెడ్డిని ప్రభుత్వం లూప్‌లైన్‌కు పంపింది. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబుకు ఆర్టీసీ ఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి సీఎస్‌ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.  

Updated Date - 2020-07-11T13:45:17+05:30 IST