Eluru: రైలు నుంచి జారిపడ్డ ఏపీఎస్పీ కానిస్టేబుల్ మృతి
ABN , First Publish Date - 2022-05-27T18:11:21+05:30 IST
పాస్ట్ పాసింజర్ రైలు నుండి జారిపడి ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉమ్మ రెడ్డి రవికుమార్ మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.
ఏలూరు: పాస్ట్ పాసింజర్ రైలులో నుంచి జారిపడి ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉమ్మ రెడ్డి రవికుమార్ మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఏలూరు జుట్ మిల్ వంతెన వద్ద కానిస్టేబుల్ రైలులో నుంచి జారి కిండపడిపోయాడు. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు తీవ్ర గాయాలపాలైన కానిస్టేబుల్ను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి చెందాడు.