ఆదాయాన్ని పెంచుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ కొత్త దారులు

ABN , First Publish Date - 2020-07-09T22:38:48+05:30 IST

లాక్ డౌన్‌తో కోల్పోయిన ఆదాయాన్ని పెంచుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ..

ఆదాయాన్ని పెంచుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ కొత్త దారులు

విజయవాడ: లాక్ డౌన్‌తో కోల్పోయిన ఆదాయాన్ని పెంచుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ వివిధ మార్గాలను అనుసరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కార్గో సేవలకు చేరువైన ఆర్టీసీ. ఇప్పుడు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు రవాణా వ్యవస్థాకు శ్రీకారం చుట్టింది. సంచార రైతుబజార్, కోవిడ్ పరీక్షలు నిర్వహించే సంజీవిని వాహనాలతోపాటు డ్రైవింగ్ శిక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలను కూడా ఆర్టీసీ ఇకమీదట తీసుకురానుంది. ఇప్పటికే వీటిని రూపొందించిన నమూనా బస్సులను ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ పరిశీలించారు. తెలంగాణలో బస్సులను నడిపేందుకు ఇంకా స్పష్టత రాలేదని ఆయన అన్నారు.

Updated Date - 2020-07-09T22:38:48+05:30 IST