ఏప్రిల్ 1 నుంచి స్వచ్ఛ పెట్రోల్
ABN , First Publish Date - 2020-02-20T09:33:44+05:30 IST
ప్రపంచంలోనే అత్యంత శుద్ధి చేసిన ‘యూరో-6’ (బీఎస్-6) ప్రమాణాలు కలిగిన స్వచ్ఛ పెట్రోల్, డీ జిల్ను ఏప్రిల్ 1
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ప్రపంచంలోనే అత్యంత శుద్ధి చేసిన ‘యూరో-6’ (బీఎస్-6) ప్రమాణాలు కలిగిన స్వచ్ఛ పెట్రోల్, డీ జిల్ను ఏప్రిల్ 1 నుంచి భారత్ వినియోగంలోకి తీసుకురానుంది. దీంతో వాతావరణ కాలుష్యం చాలా మేరకు తగ్గే అవకాశముంది. ప్రస్తుతం ‘యూరో-4’ పెట్రోల్, డీజిల్ అందుతోంది. తదుపరి ‘యూరో-5’ కాకుండా నేరుగా ‘6’కి భారత్ మారనుంది. భారత్ మినహా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన ఏ దేశమూ ఇప్పటివరకు యూరో-4 నుంచి నేరుగా యూరో-6కు మారలేదు.