షీనా బోరా హత్య కేసు: బెయిల్ కోసం ఇంద్రాణి డ్రైవర్ పిటిషన్

ABN , First Publish Date - 2021-01-16T02:55:20+05:30 IST

షీనా బోరా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన కీలక నిందితుడు శ్యాంవర్ రాయ్ మరోసారి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు...

షీనా బోరా హత్య కేసు: బెయిల్ కోసం ఇంద్రాణి డ్రైవర్ పిటిషన్

ముంబై: షీనా బోరా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన కీలక నిందితుడు శ్యాంవర్ రాయ్ మరోసారి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై ఈ నెల 19లోగా స్పందన తెలియజేయాలంటూ జైలు అధికారులకు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ జేడీ జడ్గాలే ఆదేశించారు. కాగా ఇంతకు ముందు కూడా శ్యాంవర్ రాయ్ రెండు సార్లు కరోనా పేరుతో బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీ వద్ద శ్యాంవర్ రాయ్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. 2015లో పోలీసులు అతడిని ఓ అక్రమ ఆయుధాల కేసులో అరెస్ట్ చేశారు. విచారణ సమయంలో అతడు షీనాబోరా హత్య గురించి వెల్లడించడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం 2012 ఏప్రిల్‌లో షీనా బోరా హత్యకు గురికాగా.. రాయ్‌గడ్ జిల్లాలోని ఓ అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని దహనం చేశారు.

Updated Date - 2021-01-16T02:55:20+05:30 IST