పదో తరగతి విద్యార్థులకు సమీపిస్తున్న పరీక్షలు
ABN , First Publish Date - 2022-04-26T03:52:43+05:30 IST
పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు సమీపిస్తున్నాయి. ఏకా గ్రత, ప్రణాళికతో చదవడం ఎంతో అవసర మని నిపుణులు అంటున్నారు. ఈ సారి 11 ప్రశ్నపత్రాలకు బదులు ఆరు మాత్రమే నిర్వ హించనున్నారు.
- ఏకాగ్రత, ప్రణాళికతో విజయం సొంతం: నిపుణులు
సిర్పూర్(టి), ఏప్రిల్ 25: పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు సమీపిస్తున్నాయి. ఏకా గ్రత, ప్రణాళికతో చదవడం ఎంతో అవసర మని నిపుణులు అంటున్నారు. ఈ సారి 11 ప్రశ్నపత్రాలకు బదులు ఆరు మాత్రమే నిర్వ హించనున్నారు. సమయం చాలా తక్కువ ఉన్నందున తెలిసిన విషయాల్ని మరిచి పోకుండా గుర్తుంచుకోవాలి. ఆందోళన చెంద కుండా ప్రణాళికతో చదవాలి. ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవడానికి ఉపాధ్యా యుల సూచనలు, పద్ధతు లను పాటించాలి. తెల్లవారు జాము 4గంటల తరువాత చదివితే బాగా గుర్తుంటుంది. అనవసర విషయాలైన క్రికెట్మ్యాచ్లు, టీవీ, సెల్ఫో న్లు, సామాజిక మాధ్యమాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇంట్లో తల్లిదండ్రులు సైతం పిల్లలు చదువుకునే రూంలో టీవీలు చూడడం మానుకోవాలి. పరీక్షలకు కావాల్సిన సామగ్రి ముందే సిద్ధం చేసుకోవాలి. పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన తరువాత హైరానా పడకుండా మొదట ప్రశ్నాపత్రం చదివి మనకు వచ్చిన సమాధానం కొట్టి వేయకుండా రాయాలి. తరువాత తెలియని వాటి గురించి ఆలోచించి రాయాలి. భయం వీడి ప్రశాంతంగా పరీక్షలు రాయాలి.