పుష్కరాల విజయవంతంలో కీలక పాత్ర

ABN , First Publish Date - 2020-12-06T04:56:34+05:30 IST

పవిత్ర తుంగభద్ర నది పుష్కరాలు విజయవంతం కావడంలో మీడియా కీలక పాత్ర పోషించిందని కలెక్టర్‌ జి. వీరపాండియన్‌ అన్నారు.

పుష్కరాల విజయవంతంలో కీలక పాత్ర

  1.   కలెక్టర్‌ జి. వీరపాండియన్‌
  2.   మీడియా ప్రతినిధులకు అభినందన సభ


కర్నూలు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): పవిత్ర తుంగభద్ర నది పుష్కరాలు విజయవంతం కావడంలో మీడియా కీలక పాత్ర పోషించిందని కలెక్టర్‌ జి. వీరపాండియన్‌ అన్నారు. కర్నూలు నగర శివారులోని వీజెఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో పుష్కరాల విజయవంతంపై పాత్రికేయులతో కలెక్టర్‌ మీడియా అభినందన సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా పాత్రికేయులు విశేషంగా కృషి చేశారని, మంచి కథనాలు రాశారని, సమాచారాన్ని ఎప్పటికపుడు ప్రజలకు చేరవేశారన్నారు. వారు చేసిన కృషికి గుర్తుగా ఈ అభినందన సభను ఏర్పాటు చేశామన్నారు. మీడియా మిత్రులకు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు. ఎస్పీ మాట్లాడుతూ పుష్కరాల రోజుల్లో  పోలీసు శాఖ అందించిన సేవలను  మీడియా చాలా బాగా ప్రచారం చేసిందని అఆన్నరు.  అనంతరం పాత్రికేయులకు కలెక్టర్‌, ఎస్పీ ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్‌ డీకే బాలాజీ, జడ్పీ సీఈవో వెంకట సుబ్బయ్య, సమాచార శాఖ ఉపసంచాలకులు పి. తిమ్మప్ప  పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-06T04:56:34+05:30 IST