సచివాలయ ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలి

ABN , First Publish Date - 2020-11-29T06:01:17+05:30 IST

సచివాలయ అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేత

సచివాలయ ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలి
నియామకపత్రాలను అందిస్తున్న జడ్పీ సీఈవో, డీపీవోలు

జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి


చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 28: గ్రామ సచివాలయాల ఉద్యోగులు విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉందని జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి అన్నారు. స్థానిక జడ్పీ మీటింగ్‌హాలులో శనివారం పంచాయతీ సెక్రటరీలుగా(గ్రేడ్‌-5) ఎంపికైన 9 మందికి, డిజిటల్‌ అసిస్టెంట్లుగా(గ్రేడ్‌-6) ఎంపికైన 277 మంది అభ్యర్థులకు ఆయన నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డీపీవో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలందించాలని సూచించారు. స్థానిక నాగయ్య కళాక్షేత్రంలో 264 మంది సచివాలయ అభ్యర్థులకు కమిషనర్‌ విశ్వనాథ్‌ నియామకపత్రాలను ఇచ్చారు. సమావేశంలో జిల్లా వనరుల కేంద్రం కో-ఆర్డినేటర్‌ ఐఆర్‌ షణ్ముగరామ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-29T06:01:17+05:30 IST