పండ్ల తోటలకు దరఖాస్తు చేసుకోండి

ABN , First Publish Date - 2021-02-25T05:27:03+05:30 IST

2021-22 సంవత్సరానికి గానూ పండ్ల తోటలను పెంచేందుకు రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఏపీవో సురేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

పండ్ల తోటలకు దరఖాస్తు చేసుకోండి

రామాపురం, ఫిబ్రవరి24: 2021-22 సంవత్సరానికి గానూ పండ్ల తోటలను పెంచేందుకు రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఏపీవో సురేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఉపాధి కార్యాలయంలో   సిబ్బందికి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సన్న, చిన్నకారు రైతులు తమ పంట పొలాల్లో పండ్ల తోటలను పెంచుకునే దానికి ఐదెకరాలలోపు ఉన్న ప్రతి రైతు మార్చి 31లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన అన్నారు. అలాగే మండలంలో ఇప్పటి వరకు 1,160 మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారని, ఇంకా కూలీల సంఖ్య పెంచాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-25T05:27:03+05:30 IST