మే 31 దాకా పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల దరఖాస్తులు

ABN , First Publish Date - 2021-04-17T12:14:54+05:30 IST

పోస్ట్‌మెట్రిక్‌ ఉపకార వేతనాల (ఫ్రెష్‌/రెన్యూవల్‌) కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం పొడిగించింది. మార్చి 31తో ముగిసిన ఈ గడువును...

మే 31 దాకా పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల దరఖాస్తులు

హైదరాబాద్‌: పోస్ట్‌మెట్రిక్‌ ఉపకార వేతనాల (ఫ్రెష్‌/రెన్యూవల్‌) కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం పొడిగించింది. మార్చి 31తో ముగిసిన ఈ గడువును మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఓ ప్రకటనలో తెలిపారు. పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ స్కీమ్‌ కింద ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీలు, దివ్యాంగులకు ఉపకార వేతనాలు అందజేస్తోంది. ‘ఈ-పాస్‌’ పోర్టల్‌ telanganae-pass. cgg. gov.inలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Updated Date - 2021-04-17T12:14:54+05:30 IST