ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు
ABN , First Publish Date - 2020-07-07T11:16:14+05:30 IST
రాజపురం ఏపీ ఆదర్శపాఠశాలలో 2020-21 విద్యాసంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎస్.కుమారస్వామిరెడ్డి
కవిటి:రాజపురం ఏపీ ఆదర్శపాఠశాలలో 2020-21 విద్యాసంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎస్.కుమారస్వామిరెడ్డి తెలిపారు. లాటరీ పద్ధతిలో జరిగే ప్రవేశాలకు అర్హత గల విద్యార్థులు ఈనెల 25లోగా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.ఎస్సీ, ఎస్టీలు రూ.50, బీసీ, ఓసీ విద్యార్థులు రూ.100 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
రణస్థలం : ఆదర్శపాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశానికి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మహేశ్వరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేయాలని, ఓసీ, బీసీ విద్యార్థులు రూ 100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ 50 చెల్లించాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఏపీ మోడల్ స్కూల్ సిబ్బందని సంప్రదించాలని తెలిపారు.