5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు
ABN , First Publish Date - 2021-07-25T05:00:20+05:30 IST
జిల్లాలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన అభివృద్ధి సంస్థ జిల్లా కన్వీనర్, గిరిజన గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ రవీంద్రయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు.
రాయచోటి, జూలై24: జిల్లాలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన అభివృద్ధి సంస్థ జిల్లా కన్వీనర్, గిరిజన గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ రవీంద్రయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. దరఖాస్తు గడువు ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పొడిగించడం జరిగిందన్నారు. అదే విధంగా రాయచోటి గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో 5వ తరగతిలో 80, 6వ తరగతిలో 54, 7వ తరగతిలో 19, 8వ తరగతిలో 16, 9వ తరగతిలో 2 చొప్పున ఖాళీలు ఉన్నట్లు ఆయన తెలిపారు. అర్హత గల గిరిజన బాలికలు ఈ నెల 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపిక విధానం లాటరీ పద్ధతి ద్వారా జరుగుతుందన్నారు.