5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు

ABN , First Publish Date - 2021-07-25T05:00:20+05:30 IST

జిల్లాలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ గిరిజన అభివృద్ధి సంస్థ జిల్లా కన్వీనర్‌, గిరిజన గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్‌ రవీంద్రయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు.

5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు

రాయచోటి, జూలై24: జిల్లాలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ గిరిజన అభివృద్ధి సంస్థ జిల్లా కన్వీనర్‌, గిరిజన గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్‌ రవీంద్రయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. దరఖాస్తు గడువు ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పొడిగించడం జరిగిందన్నారు. అదే విధంగా రాయచోటి గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో 5వ తరగతిలో 80, 6వ తరగతిలో 54, 7వ తరగతిలో 19, 8వ తరగతిలో 16, 9వ తరగతిలో 2 చొప్పున ఖాళీలు ఉన్నట్లు ఆయన తెలిపారు. అర్హత గల గిరిజన బాలికలు ఈ నెల 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపిక విధానం లాటరీ పద్ధతి ద్వారా జరుగుతుందన్నారు. 

Updated Date - 2021-07-25T05:00:20+05:30 IST