మాజీ ఎంపీపీ ‘అప్పికొండ’ మృతి
ABN , First Publish Date - 2020-08-07T10:35:21+05:30 IST
స్థానిక మాజీ ఎంపీపీ, సీనియర్ నేత అప్పికొండ శ్రీరాములునాయుడు (72) గురువారం మృతి చెందారు.
రామభద్రపురం, ఆగస్టు 6: స్థానిక మాజీ ఎంపీపీ, సీనియర్ నేత అప్పికొండ శ్రీరాములునాయుడు (72) గురువారం మృతి చెందారు. ఈయన గత కొంతకాలంగా విశాఖలోని ఓ పైవేట్ ఆసు పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీరా ములనాయుడు రామభద్రపురం ఎంపీపీగా మూడుసార్లు, జెడ్పీటీసీగా ఒకసారి పదవులు అలంకరించారు. టీడీపీలో మంచి నాయకుడిగా పేరుపొందిన ఆయన ఆ తరువాత ఎన్టీఆర్ తెలుగుదేశం, ప్రజారాజ్యం, కాంగ్రెస్పార్టీలలో చేరారు.
ప్రస్తుతం అధికార వైసీపీలో ఉ న్నా రు. ఈయన భార్య అప్పికొండ సరస్వతి జెడ్పీటీసీ పోటీలో ఉ న్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా అప్పికొండకు జి ల్లాలో మంచి గుర్తింపు ఉంది. ఆయనకు భార్యతోపాటు ఒక కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల మండలంలో నాయకులు చొక్కాపు లక్ష్మణరావు, చింతల రామకృష్ణ, మడక తిరు పతిరావు ప్రగాఢ సానుభూతితెలిపారు.
శోకసంద్రంలో కొట్టక్కి
అప్పికొండ మృతితో మండల పరిధిలో ఆయన స్వగ్రామం కొట్టక్కిలో విషాదం నెలకొంది. ఎన్నో పదవులు అలంకరించిన తమ గ్రామానికి గుర్తుంపు తెచ్చారని పలువురు గ్రామస్థులు విచారం వ్యక్తంచేశారు.
బేబీనాయన సంతాపం
బొబ్బిలి: రామభద్రపురం ప్రముఖ సీనియర్ నాయకుడు అప్పికొండ శ్రీరాములు నా యుడు మృతికి బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బేబీనాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అనేక పదవులు నిర్వహించిన శ్రీరాములునాయుడు పేదలకు ఎన్నో సేవలందించారన్నారు. పరిగణించబడ్డారన్నారు.
సాలూరు రూరల్: రామభద్రపురం మాజీ ఎంపీపీ అప్పికొండ శ్రీరాములునాయుడు మృతికి వైసీపీ నేతలు సువ్వాడ రమణ, పిరిడి రామకృష్ణ, రెడ్డి పద్మావతి, సురేష్, దండి శ్రీనివాసరావు, సువ్వాడ గణేష్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.