ముగిసిన ఏపీపీజీఈ సెట్-2020
ABN , First Publish Date - 2020-10-01T09:16:38+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్, ఫార్మశీ పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీపీజీఈ సెట్-2020 ప్రశాంతంగా ముగిసింది...
ఏయూ క్యాంపస్ (విశాఖపట్నం), సెప్టెంబరు 30: రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్, ఫార్మశీ పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీపీజీఈ సెట్-2020 ప్రశాంతంగా ముగిసింది. మూడు రోజుల్లో జరిగిన పరీక్షలకు మొత్తం 28,868 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 22,911 మంది హాజరైనట్టు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పి.శ్రీనివాసరావు తెలిపారు.