SHAILAJA NATH: పాఠశాలల పునఃప్రారంభం వద్దు

ABN , First Publish Date - 2021-07-24T00:33:06+05:30 IST

రాష్ట్రంలోని పాఠశాలలను ఆగస్టు 16 నుంచి తిరిగి ప్రారంభించ సరికాదని ఏపీ పీసీసీ అధ్యక్షుడు

SHAILAJA NATH: పాఠశాలల పునఃప్రారంభం వద్దు

రాజమండ్రి: రాష్ట్రంలోని పాఠశాలలను ఆగస్టు 16 నుంచి తిరిగి ప్రారంభించ సరికాదని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. నగరంలో ఏబీఎన్‌తో  శైలజానాథ్ మాట్లాడారు. కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలు పునఃప్రారంబించటం సమంజసం కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆయన విమర్శించారు. పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం తల్లిదండ్రుల, విద్యార్థుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం పాఠశాలల పునఃప్రారంభం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి శైలజానాథ్ విజ్జప్తి చేసారు. 

Updated Date - 2021-07-24T00:33:06+05:30 IST