అప్పన్న హుండీ ఆదాయం రూ.1.47 కోట్లు
ABN , First Publish Date - 2022-06-29T05:59:29+05:30 IST
వరాహలక్ష్మీనృసింహస్వామికి గడచిన 27 రోజులలో భక్తులు ఆలయ హుండీలలో సమర్పించిన మొక్కుబడుల ద్వారా రూ.1.47 కోట్ల ఆదాయం సమకూరింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంవీ సూర్యకళ, జ్ఞానాపురం ఎర్నిమాంబ ఆలయ ఈఓ సురేష్ ప్రత్యేక పర్యవేక్షణలో మంగళవారం ఆలయ బేడామండపంలో హుండీల లెక్కింపు చేపట్టారు.
సింహాచలం, జూన్ 28: వరాహలక్ష్మీనృసింహస్వామికి గడచిన 27 రోజులలో భక్తులు ఆలయ హుండీలలో సమర్పించిన మొక్కుబడుల ద్వారా రూ.1.47 కోట్ల ఆదాయం సమకూరింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంవీ సూర్యకళ, జ్ఞానాపురం ఎర్నిమాంబ ఆలయ ఈఓ సురేష్ ప్రత్యేక పర్యవేక్షణలో మంగళవారం ఆలయ బేడామండపంలో హుండీల లెక్కింపు చేపట్టారు. నగదు రూపంలో రూ.1,47,55,531 లభ్యంకాగా, 122.8 గ్రామల స్వర్ణం, 14.2 కిలోల రజిత ఆభరణాల రూపంలో ఖజానాకు జమయింది. 148 అమెరికన్ డాలర్లు, కువైట్కు చెందిన 1.25 దీనార్లు, బీజీఈకి చెందిన 20 యూరోలు, న్యూజిలాండ్కు చెందిన 50 డాలర్లు, కెనడాకు చెందిన 25 డాలర్లు లభించాయి. లెక్కింపులో దేవస్థానంలోని వివిధ విభాగాలకు చెందిన ఏఈఓలు, పర్యవేక్షణాధికారులు, శ్రీహరిసేవా సత్సంగ్ సేవకులు, ఎస్వీఎల్ఎన్ వాకర్స్క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.