రమణీయం.. బాలబాలాజీ కల్యాణం

ABN , First Publish Date - 2021-06-22T06:31:17+05:30 IST

మామిడికుదురు, జూన్‌ 21: అప్పనపల్లి శ్రీబాలబాలాజీ కల్యాణాన్ని సోమవారం రాత్రి 9.03 గంటలకు కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పరిమిత భక్తుల సమక్షంలో రమణీయంగా నిర్వహించారు. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు దంపతులు పట్టువస్త్రాలను సమర్పించారు

రమణీయం.. బాలబాలాజీ కల్యాణం
బాలబాలాజీ స్వామి కల్యాణాన్ని నిర్వహిస్తున్న అర్చకస్వాములు

మామిడికుదురు, జూన్‌ 21: అప్పనపల్లి శ్రీబాలబాలాజీ కల్యాణాన్ని సోమవారం రాత్రి 9.03 గంటలకు కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పరిమిత భక్తుల సమక్షంలో రమణీయంగా నిర్వహించారు. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు దంపతులు పట్టువస్త్రాలను సమర్పించారు. ప్రధానార్చకుడు ఎంపీ సింగరాచార్యుల ఆధ్వర్యంలో అర్చక స్వాములు కల్యాణాన్ని కనుల పండువగా జరిపారు. పలువురు భక్తులు పరోక్షంగా కల్యాణంలో పాల్గొన్నారు. సోమవారం ఉదయం నుంచి పలు పూజలు నిర్వహించారు. సర్పంచ్‌ గెడ్డం మంగాలక్ష్మి వెంకటేశ్వరరావు, ధర్మకర్తల మండలి చైర్మన్‌ పిచ్చిక శివనాగసత్యనారాయణ (చిన్నా), సహాయ కమిషనర్‌ పి.బాబూరావు, పాలకమండలి సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T06:31:17+05:30 IST