రింగు వలల వివాదంపై మంత్రుల సమావేశం

ABN , First Publish Date - 2022-01-06T01:49:04+05:30 IST

రింగు వలల వివాదంపై మంత్రుల సమావేశం ముగిసింది. ఆమోదయోగ్యమైన పరిష్కరాన్ని సమావేశం చూపలేకపోయింది.

రింగు వలల వివాదంపై మంత్రుల సమావేశం

విశాఖ: రింగు వలల వివాదంపై మంత్రుల సమావేశం ముగిసింది. ఆమోదయోగ్యమైన పరిష్కరాన్ని సమావేశం చూపలేకపోయింది. ఈ వివాదం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉందని మంత్రి అప్పలరాజు అన్నారు. సున్నితమైన సమస్య పై కొందరు రాజకీయాలను జోప్పిస్తున్నారని, వివాదం వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని అప్పలరాజు ఆరోపించారు. 8 కిలో మీటర్ల అవతల మాత్రమే రింగు వలలతో వేటాడాలన్నారు. లైసెన్స్ లేని వారు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లైసెన్స్ ఉన్న వారు 8 కిలో మీటర్ల అవతల సముద్రంలో వేటాడాలన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. 

Updated Date - 2022-01-06T01:49:04+05:30 IST