ఇప్పటివరకు 30 ఇళ్లు కూడా కట్టలేదు: జనసేన నేత
ABN , First Publish Date - 2022-04-28T21:25:23+05:30 IST
ఇప్పటివరకు 30 ఇళ్లు కూడా కట్టలేదు: జనసేన నేత
ఏలూరు: ప్రభుత్వం 30 లక్షల ఇళ్లు కట్టి ఇస్తామని ప్రజలను మోసం చేసిందని జనసేన నేత అప్పలనాయుడు మండిపడ్డారు. ఏలూరులో 30 వేల ఇళ్ల నిర్మాణం చేస్తామని..ఇప్పటివరకు 30 ఇళ్లు కూడా కట్టలేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు పవన్ ఆర్థికసాయం చేస్తుంటే.. మంత్రులేమో విమరిస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ నేతలు ప్రతిపక్షాలపై విమర్శలు మాని ప్రజాసమస్యలపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు.