హరియాణాలో అపోలో
ABN , First Publish Date - 2022-08-09T05:52:35+05:30 IST
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ గురుగావ్లో దాదాపు 650 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం నయతి హెల్త్కేర్ అండ్ రిసెర్చ్
రూ.450 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ గురుగావ్లో దాదాపు 650 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం నయతి హెల్త్కేర్ అండ్ రిసెర్చ్ ఎన్సీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 5.63 ఎకరాల స్థలాన్ని దాదాపు రూ.450 కోట్లకు కొనుగోలు చేసినట్లు అపోలో హాస్పిటల్స్ వెల్లడించింది. హరియాణాలోకి అడుగుపెట్టడం అపోలోకు ఒక కీలక మైలురాయని, రెండేళ్లలో ఆసుపత్రి సిద్ధం అవుతుందని అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు.