14న ‘Apollo’లో సైక్లింగ్‌

ABN , First Publish Date - 2021-11-07T12:42:17+05:30 IST

చిన్నారులలో కేన్సర్‌పై అవగాహన కల్పించడానికి, చికిత్సకు అవసరమైన నిధుల సేకరణకు డ్యుయాథ్లాన్‌ (డీ2డీ) కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు అపోలో ఆస్పత్రి ప్రకటించింది. ఈ నెల...

14న ‘Apollo’లో సైక్లింగ్‌

హైదరాబాద్‌ సిటీ: చిన్నారులలో కేన్సర్‌పై అవగాహన కల్పించడానికి, చికిత్సకు అవసరమైన నిధుల సేకరణకు డ్యుయాథ్లాన్‌ (డీ2డీ) కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు అపోలో ఆస్పత్రి ప్రకటించింది.  ఈ నెల 14న సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు డీ2డీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు శనివారం తెల్లవారు జామున కేబీఆర్‌ పార్క్‌ వద్ద సైక్లింగ్‌ నిర్వహించారు. అపోలో ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ శోభనా కామినేని, సందీ్‌పరెడ్డి, అనూష కామినేని, సవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శోభనా కామినేని మాట్లాడుతూ ఈ డ్యుయాథ్లాన్‌ కార్యక్రమంలో పాల్గొని, పీడియాట్రిక్‌ కేన్సర్‌తో బాధపడుతున్న పేద పిల్లలకు చికిత్సను అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొనదల్చిన వారు ఈ నెల 13లోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. 

Updated Date - 2021-11-07T12:42:17+05:30 IST