మీ పేరు తల్చుకుంటే మా సంకల్పబలం రెట్టింపు అవుతుంది: లోకేశ్
ABN , First Publish Date - 2020-10-15T17:16:34+05:30 IST
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు.
అమరావతి: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. సామాన్యుడిగా జన్మించి, నిరాడంబరంగా జీవించి, అసామాన్య విజయాలను అందుకున్న'మిస్సైల్ మ్యాన్' అబ్దుల్ కలాం పేరు తలచుకుంటే సంకల్పబలం రెట్టింపు అవుతుందని ట్వీట్ చేశారు. ఇవాళ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్ఫూర్తిదాయక చరిత్రను మననం చేసుకుందామని పేర్కొన్నారు.