జగన్ చర్యలు తీసుకోవాలి.. లేదంటే ఫిర్యాదు చేస్తాం: దళిత ఉద్యోగులు

ABN , First Publish Date - 2020-09-24T23:08:49+05:30 IST

విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి డైరెక్టర్ సూరా బాలకృష్ణ.. దళిత ఉద్యోగులపై వివక్ష చూపుతున్నారని..

జగన్ చర్యలు తీసుకోవాలి.. లేదంటే ఫిర్యాదు చేస్తాం: దళిత ఉద్యోగులు

గుంటూరు: విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి డైరెక్టర్ సూరా బాలకృష్ణ.. దళిత ఉద్యోగులపై వివక్ష చూపుతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. ఏడాది కాలంగా తమ సమస్యలు చెప్పుకునేందుకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని, ఇదేమని అడిగితే చులకన భావంతో మాట్లాడుతున్నారని ఏపీఈడబ్ల్యూఐడీసీ ఉద్యోగ సంఘాల రాష్ట్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డైరెక్టర్ సూరా బాలకృష్ణపై జగన్ చర్యలు తీసుకోకపోతే జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఎస్టీ, ఎస్సీ ఉద్యోగ సంఘం నేతలు హెచ్చరించారు. 

Updated Date - 2020-09-24T23:08:49+05:30 IST