కాంగ్రెస్తోనే నవ్యాంధ్రకు హోదా సాధ్యం
ABN , First Publish Date - 2021-06-20T05:56:53+05:30 IST
నవ్యాంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతోపాటు అభివృద్ధి కాంగ్రెస్ నాయకత్వంతోనే సాధ్యమవుతుందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలి పేర్కొన్నారు.
ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి
గుంటూరు, జూన్ 19: నవ్యాంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతోపాటు అభివృద్ధి కాంగ్రెస్ నాయకత్వంతోనే సాధ్యమవుతుందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలి పేర్కొన్నారు. రాహుల్గాంధీ జన్మదినోత్సవం పురస్కరించుకొని లాలాపేటలోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో మస్తాన్వలి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, పీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి వినయ్కుమార్ ఇతర నాయకులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా లింగంశెట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని రాహుల్గాంధీ ఇచ్చిన హామీని గుర్తుచేశారు. ప్రజలు రాహుల్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. అలానే రాహుల్గాంధీ జన్మదినం పురస్కరించుకొని యూత్ కాంగ్రెస్ పశ్చిమ నియోజకవర్గం అధ్యక్షుడు సయ్యద్ జబీవుల్లా ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులున్నారు.