నియంతలే రాజ్యమేలుతారు: శైలజానాథ్‌

ABN , First Publish Date - 2021-11-14T01:16:14+05:30 IST

దేశంలో పాలకుల నియంతృత్వ ధోరణి పెరిగితే నియంతలే రాజ్యమేలుతారని

నియంతలే రాజ్యమేలుతారు: శైలజానాథ్‌

విజయవాడ: దేశంలో పాలకుల నియంతృత్వ ధోరణి పెరిగితే నియంతలే రాజ్యమేలుతారని ఏపీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌ అన్నారు. కరోనా వేళ ప్రజలు ఉపాధి కోల్పోతే.. కార్పొరేట్ సంస్థల ఆస్తులు మాత్రం రెట్టింపు అయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలను సపోర్ట్ చేసే భావజాలమే దేశంలో పని చేస్తుందన్నారు. పాలకుల రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై గళం విప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, సీఎం జగన్ దుర్మార్గపు పాలనను నిలదీయాలన్నారు. 


Updated Date - 2021-11-14T01:16:14+05:30 IST