బడ్జెట్లో ఏపీకి మొండి చేయి: శైలజానాథ్
ABN , First Publish Date - 2022-02-01T23:34:06+05:30 IST
బడ్జెట్లో ఏపీకి కేంద్రం మొండి చేయి చూపిందని ఏపీసీసీ అధ్యక్షుడు
అమరావతి: బడ్జెట్లో ఏపీకి కేంద్రం మొండి చేయి చూపిందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇతర అంశాల ప్రస్తావనే లేదన్నారు. నోట్ల రద్దు నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పేదల జీవితాలను చిన్నాభిన్నం చేసిందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు డిజిటల్ భారత్ అంటూ కొత్త పల్లవి అందుకుందన్నారు. ఈ బడ్జెట్ అన్నివర్గాల వారిని తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందన్నారు. కేంద్రం మెడలు వంచుతామన్న జగన్, ఎంపీలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రానికి నష్టం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని శైలజానాథ్ పేర్కొన్నారు.