రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీకి జగన్ మద్దతు: Sailajanath

ABN , First Publish Date - 2022-07-07T18:12:45+05:30 IST

రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ(BJP)కి సీఎం జగన్ (Jagan) మద్దతు ఇస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ (Sailajanath) మండిపడ్డారు.

రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీకి జగన్ మద్దతు: Sailajanath

విజయవాడ: రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ(BJP)కి సీఎం జగన్ (Jagan) మద్దతు ఇస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ (Sailajanath) మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్(Congress) పార్టీ చేపట్టిన ధర్నాలో శైలజానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ(TDP), వైసీపీ(YCP)లు బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా వోట్ వేయాలని డిమాండ్ చేశారు. 25 ఎంపీలు ఇస్తే హోదా తీసుకువస్తా అని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. హోదా, విభజన హామీలను మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీలందరినీ కలిసి హోదా విభజన హామీలపై ఒత్తిడి తెస్తామన్నారు. రాష్ట్రానికి హోదా విభజన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని శైలజానాథ్ అన్నారు. 

Updated Date - 2022-07-07T18:12:45+05:30 IST