వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకునే వరకు పోరాడుతాం: శైలజానాథ్
ABN , First Publish Date - 2020-09-29T17:44:43+05:30 IST
రైతులను తరపున గవర్నర్ను కలిశామని... పేదవాటి ఆకలి తీర్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ తెలిపారు
విజయవాడ: రైతులను తరపున గవర్నర్ను కలిశామని... పేదవాటి ఆకలి తీర్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ తెలిపారు. మంగళవారం రాజ్భవన్లో గవర్నర్తో ఏపీసీసీ నేతలు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో శైలజానాథ్ మాట్లాడుతూ... ఎమ్ఎస్పీ లేకుండా ప్రోక్యూర్మెంట్స్ లేకుండా కార్పొరేట్స్ దయా దాక్షిణ్యాలతో బ్రతికే వైఖరిని తాము ఖండిస్తున్నామన్నారు. వైసీపీ కూడా బీజేపీతో కలిసి పోయిందని ఆరోపించారు. కరెంట్ మీటర్లు బిగించి రైతుల మెడకు ఉరి తాడు బిగిస్తున్నారని విమర్శించారు. ఈ బిల్లులు వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి కార్యక్రమాలు చేయబోతున్నట్లు శైలజానాథ్ తెలిపారు.