పరిపాలన చేతకాక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు: Sailajanath
ABN , First Publish Date - 2022-01-11T17:25:56+05:30 IST
పరిపాలన చేతకాక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ విమర్శించారు.
అనంతపురం: పరిపాలన చేతకాక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ విమర్శించారు. ఏ హేతుబద్ధతతో ఇంటి పన్ను వసూలు చేస్తున్నారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కొద్ది మంది ఉద్యోగ సంఘాల నాయకులను లొంగ దీసుకుని మొత్తం ఉద్యోగ లోకానికి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన జాగరణ యాత్ర చేపడతామని శైలజానాథ్ ప్రకటించారు.