వైసీపీ నేతలు రాచరిక పరిపాలన చేస్తున్నారా?:సీనియర్‌ న్యాయవాది

ABN , First Publish Date - 2020-05-27T00:23:11+05:30 IST

న్యాయవ్యవస్థను గౌరవించాల్సిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కించపరుస్తున్నారని హైకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ అన్నారు.

వైసీపీ నేతలు రాచరిక పరిపాలన చేస్తున్నారా?:సీనియర్‌ న్యాయవాది

విజయవాడ: న్యాయవ్యవస్థను గౌరవించాల్సిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కించపరుస్తున్నారని హైకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ అన్నారు. న్యాయవ్యవస్థపై దాడిగానే భావిస్తున్నానని చెప్పారు. జడ్జిలకు రాజకీయరంగు పులమడం సరికాదన్నారు. వైసీపీ నేతలు రాచరిక పరిపాలన చేస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. న్యాయస్థానంపై అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మంచిదికాదని సూచించారు. హైకోర్టు తీర్పుల్లో తప్పుంటే సుప్రీంకు వెళ్లాలి కానీ.. ఇలా ఇష్టానుసారం మాట్లాడడం మంచిపద్ధతి కాదన్నారు. 

Updated Date - 2020-05-27T00:23:11+05:30 IST