ఫిలప్పిన్స్‌లో ఏపీ విద్యార్థి మృతి.. కేంద్రమంత్రికి చంద్రబాబు లేఖ!

ABN , First Publish Date - 2020-04-06T23:40:04+05:30 IST

ఫిలప్పిన్స్‌లో మృతి చెందిన తెలుగు విద్యార్థి వంశీ భౌతిక కాయాన్ని రాష్ట్రానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుబ్రహ్మణ్యంకు

ఫిలప్పిన్స్‌లో ఏపీ విద్యార్థి మృతి.. కేంద్రమంత్రికి చంద్రబాబు లేఖ!

అమరావతి: ఫిలప్పిన్స్‌లో మృతి చెందిన తెలుగు విద్యార్థి వంశీ భౌతిక కాయాన్ని రాష్ట్రానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుబ్రహ్మణ్యంకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. అనంతపురం పట్టణానికి చెందిన కొండిగల్ల పెద్దింటి వంశీ.. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా వైద్య విద్యకోసం ఫిలిప్పిన్స్ వెళ్లినట్టు లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఫిలిప్పిన్స్‌లోని సీఈబీయూ యూనివర్సిటీలో చదువుకుంటున్న వంశీ.. సోమవారం ఉదయం మరణించినట్లు కేంద్రమంత్రికి రాసిన లేఖలో చంద్రబాబు వివరించారు. కాగా.. మరణ వార్త తెలియడంతో వంశీ తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇదిలా ఉంటే.. వంశీ మరణానికి సంబంధించిన కారణాలు తెలియరాలేదు. 




Updated Date - 2020-04-06T23:40:04+05:30 IST