ఫోటో ఓటర్ల జాబితా సవరణకు ఈసీ నోటిఫికేషన్ జారీ

ABN , First Publish Date - 2020-08-11T00:58:08+05:30 IST

ఫోటో ఓటర్ల జాబితా సవరణ, పేర్ల నమోదు, మార్పులు, అభ్యంతరాల స్వీకరణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. 2021 జనవరి 1 నాటికి సవరించిన ఫోటో ఓటర్ల

ఫోటో ఓటర్ల జాబితా సవరణకు ఈసీ నోటిఫికేషన్ జారీ

అమరావతి: ఫోటో ఓటర్ల జాబితా సవరణ, పేర్ల నమోదు, మార్పులు, అభ్యంతరాల స్వీకరణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. 2021 జనవరి 1 నాటికి సవరించిన ఫోటో ఓటర్ల జాబితా ప్రకటనకు ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించింది. పోలింగ్ కేంద్రాల పునర్వవస్థీకరణకు, ఓటర్ల జాబితాలో వ్యక్తమైన అభ్యంతరాలపై దరఖాస్తుకు అక్టోబరు 31 వరకూ గడువు ఇచ్చింది. అలాగే సవరించిన ఓటర్ల జాబితాతో కూడిన ముసాయిదాను నవంబరు 16న ప్రకటించనున్నట్లు ఈసీ తెలిపింది. దీనిపై అభ్యంతరాలు, ఫిర్యాదులకు డిసెంబరు 15 తేదీ వరకూ సమయం ఇచ్చింది. 2021 జనవరి 15 ఫోటో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

Updated Date - 2020-08-11T00:58:08+05:30 IST