వ్యవస్థను మెరుగుపర్చేందుకే ఏపీ సేవా పోర్టల్‌

ABN , First Publish Date - 2022-01-28T06:12:30+05:30 IST

మారుమూల గ్రామాల్లో కూడా వేగంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంగా ప్రభుత్వ సేవలను అందించేలా వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఏపీ సేవా పోర్టల్‌ను ప్రారంభిస్తున్నామని జడ్పీ చైర్‌పర్సన్‌ హెనీక్రిస్టీనా, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.

వ్యవస్థను మెరుగుపర్చేందుకే ఏపీ సేవా పోర్టల్‌
కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కృష్ణదేవరాయలు, జడ్పీ చైర్‌పర్సన్‌ హెనీక్రిస్టీనా తదితరులు

గుంటూరు, జనవరి 27(ఆంధ్రజ్యోతి): మారుమూల గ్రామాల్లో కూడా వేగంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంగా ప్రభుత్వ సేవలను అందించేలా వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఏపీ సేవా పోర్టల్‌ను ప్రారంభిస్తున్నామని జడ్పీ చైర్‌పర్సన్‌ హెనీక్రిస్టీనా, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఏపీ సేవా(సీటిజన్‌ సర్వీసెస్‌) పోర్టల్‌ను సీఎం జగన్‌మోహనరెడ్డి గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఆన్‌లైన్‌లో విధానంలో బటన్‌ నొక్కి ప్రారంభించగా కలెక్టరేట్‌లోని శంకరన్‌ హాల్‌ నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్వరాజ్యం సాధనదిశగా ఏర్పాటు చేసిన సచివాయలాల ద్వారా ప్రభుత్వ సేవలను మరింత మెరుగు పరిచేందుకు ఏపీ సేవపోర్టల్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీలు దినేష్‌కుమార్‌, రాజకుమారి, శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర శాలివాహన, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్‌ చైర్మన్‌ మండేపూడి పురుషోత్తం, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్‌ చైర్మన్‌ ముంతాజ్‌ పఠాన్‌, డీఆర్‌వో కొండయ్య, డీపీవో కేశవరెడ్డి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ భాస్కరనాయుడు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-28T06:12:30+05:30 IST