ఏపీ సచివాలయ ఉద్యోగులకు మార్గం సుగమం
ABN , First Publish Date - 2020-05-27T00:23:52+05:30 IST
హైదరాబాద్లో ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు మార్గం సుగమం అయింది. హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్తేందుకు...
అమరావతి: హైదరాబాద్లో ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు మార్గం సుగమం అయింది. హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లేందుకు అనుమతి లభించింది. సచివాలయ ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం వేసే బస్సులకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ సీఎస్ సోమేష్కుమార్కు ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. సచివాలయ ఉద్యోగుల బస్సులకు సీఎస్ సోమేష్ కుమార్ అంగీకరించారు. బుధవారం ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 400 మంది ఉద్యోగులు అమరావతి చేరుకోనున్నారు. మియాపూర్, కేపీహెచ్బీ, లక్డీకపూల్, ఎల్బీనగర్ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు 10 బస్సులు ఏర్పాటు చేశారు.