ప్రభుత్వంపై ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు ఆగ్రహం

ABN , First Publish Date - 2022-02-04T21:38:17+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వపై ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం

ప్రభుత్వంపై ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు ఆగ్రహం

విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వపై ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమిలిలో ఇటీవల ధ్వంసమైన శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహాన్ని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు స్వామీ శ్రీనివాసానంద సరస్వతీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల్లో నిందితులు స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని మండిపడ్డారు. మంత్రి అవంతి, వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. అసలు మీరు హిందువులు కాదా అని ఆయన ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యాక హిందూ ఆలయాలు, విగ్రహాలపై దాడులు పెరిగిపోయాయని స్వామీ శ్రీనివాసానంద సరస్వతీ ఆరోపించారు. 


Updated Date - 2022-02-04T21:38:17+05:30 IST