ఏపీలో ఇవాల్టి కరోనా లెక్కలివి..!

ABN , First Publish Date - 2020-08-07T01:16:13+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఏపీలో గురువారం కొత్తగా...

ఏపీలో ఇవాల్టి కరోనా లెక్కలివి..!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఏపీలో గురువారం కొత్తగా 10,328 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా ఇవాళ నమోదైన కేసులను పరిశీలిస్తే.. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1351 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 1285 కరోనా కేసులు, అనంతపురం జిల్లాలో 1112 కరోనా కేసులు నమోదయినట్లు ప్రభుత్వం పేర్కొంది. గుంటూరు జిల్లాలో 868, పశ్చిమ గోదావరి 798, నెల్లూరు 788, విశాఖపట్నం 781, చిత్తూరు 755, శ్రీకాకుళం 682, కడప 604, విజయనగరం 575, ప్రకాశం 366, కృష్ణా జిల్లాలో 363 కరోనా కేసులు నమోదయ్యాయి.


ఏపీలో గురువారం కరోనా వల్ల 72 మంది మృతి చెందారు. అనంతపురం జిల్లాలో 10 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 10 మంది, గుంటూరులో 9 మంది, చిత్తూరులో 8 మంది, కృష్ణలో 6, నెల్లూరులో 6, ప్రకాశంలో 6, విశాఖపట్నంలో 4, కడపలో 3, విజయనగరం 3, పశ్చిమ గోదావరి 3, కర్నూలులో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు కరోనా వల్ల మరణించారు. ఏపీలో కరోనా మరణాల సంఖ్య 1753కి చేరింది. ఏపీలో గడచిన 24 గంటల్లో 8,516 కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,96,789కి చేరగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 82,166.



Updated Date - 2020-08-07T01:16:13+05:30 IST