మధిర కౌన్సిలర్ కోసం ఏపీ పోలీసుల గాలింపు

ABN , First Publish Date - 2021-12-11T02:31:44+05:30 IST

జిల్లాలోని మధిర వార్డు కౌన్సిలర్ మల్లాది

మధిర కౌన్సిలర్  కోసం ఏపీ పోలీసుల గాలింపు

ఖమ్మం: జిల్లాలోని మధిర వార్డు కౌన్సిలర్ మల్లాది వాసు కోసం ఏపీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికలో వాసు తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. అయితే వాసు వ్యూహాత్మకంగా ఓటు వేశాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 




ఏపీలోని వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, మంత్రి కొడాలి నానీలను చంపిన వారికి 50 లక్షల బహుమతిని ఇస్తానని కౌన్సిలర్ మల్లాది వాసు ప్రకటించిన విషయం తెలిసిందే. మధిరలో జరిగిన కమ్మ కుల సంఘం మీటింగ్‌లో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అయనపై ఏపీలో కేసులు నమోదయ్యాయి. ఏ క్షణమైనా ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో వాసు అజ్ఞాతంలోకి వెళ్లారు. 




Updated Date - 2021-12-11T02:31:44+05:30 IST