డెల్హై మేయర్గా చిత్తూరు వాసి
ABN , First Publish Date - 2021-04-12T11:10:10+05:30 IST
అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో డైల్హై మేయర్గా చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగకు చెందిన ఎన్ఆర్ఐ సముద్రాల బాబురావు తనయుడు సుధీర్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన భగవద్గీతపై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం బుచ్చినాయుడుకండ్రిగలో ఆయన నివాసం వద్ద..
అమెరికాలో తెలుగోడికి అరుదైన గౌరవం
బుచ్చినాయుడుకండ్రిగ, ఏప్రిల్ 11: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో డైల్హై మేయర్గా చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగకు చెందిన ఎన్ఆర్ఐ సముద్రాల బాబురావు తనయుడు సుధీర్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన భగవద్గీతపై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం బుచ్చినాయుడుకండ్రిగలో ఆయన నివాసం వద్ద బంధువులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అగ్రరాజ్యం అమెరికాలోని ఓ నగరానికి సుధీర్ మేయర్ కావడం బుచ్చినాయుడుకండ్రిగ గ్రామానికి, తెలుగువారికి గర్వకారణమన్నారు. భగవద్గీతపై ప్రమాణ స్వీకారం చేసి భారతదేశ ఔన్నత్యాన్ని చాటారన్నారు.