వైఎస్సార్ జలకళ పథకంపై తులసిరెడ్డి విమర్శలు
ABN , First Publish Date - 2020-09-28T21:57:00+05:30 IST
వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్సార్ జలకళ పథకంపై ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘కాంగ్రెస్ అమలు చేసిన ఇందిరా
విజయవాడ: వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్సార్ జలకళ పథకంపై ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘కాంగ్రెస్ అమలు చేసిన ఇందిరా జలప్రభ పథకమే నేటి వైఎస్సార్ జలకళ పథకం. అమ్మను మమ్మీ అని ఆర్భాటం చేసినట్లుంది వైసీపీ వైఖరి. ఇందిరా జలప్రభ కింద బోరు, మోటారు, పంపుసెట్టు, విద్యుత్ కనెక్షన్ అన్ని ఉచితమే. వైఎస్సార్ జలకళ కింద బోరు మాత్రమే ఉచితం. మిగతా ఖర్చు మాత్రం రైతు భరించాల్సిందే. మోటర్, పంపుసెట్టు, విద్యుత్ కనెక్షన్ ఖర్చు ప్రభుత్వం భరించాలి. సూక్ష్మ నీటి సాగు పద్ధతులను పునరుద్ధరించాలి’ అని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.