రైతు వెంకటయ్యను పరామర్శించిన శైలజానాథ్

ABN , First Publish Date - 2020-07-10T03:40:37+05:30 IST

నెల్లూరు : జిల్లాలోని గూడూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సీ రైతు వెంకటయ్యని పీసీసీ చీఫ్ శైలజానాథ్ పరామర్శించారు.

రైతు వెంకటయ్యను పరామర్శించిన శైలజానాథ్

నెల్లూరు : జిల్లాలోని గూడూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సీ రైతు వెంకటయ్యని పీసీసీ చీఫ్ శైలజానాథ్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ సర్కార్ తీరును తప్పుబట్టారు. హైకోర్టు స్టే ఇచ్చిన భూములని ఇళ్ల స్థలాల పేరుతో లాగేసుకోవడం సరికాదన్నారు. అధికారపార్టీ నేతలు ఒక్కసారిగా వెంకటయ్యపై దాడి చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా చేయడం హేయమన్నారు. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడం మంచిది కాదని శైలజానాథ్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-07-10T03:40:37+05:30 IST