పంచాయతీ ఎన్నికలకు అడ్డూ అదుపూ లేదా?

ABN , First Publish Date - 2021-02-26T01:48:27+05:30 IST

పంచాయతీ ఎన్నికలకు అడ్డూ అదుపూ లేదా?

పంచాయతీ ఎన్నికలకు అడ్డూ అదుపూ లేదా?

అమరావతి: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నాటి నుంచి అరాచకాలు, గొడవలు, ఏక పక్ష దాడులు, పోలీసుల వైనాన్ని ప్రజలు చూసేశారు. అయితే ఈ దాడులు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా హింస కంటిన్యూ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీలోని కొంతమంది నేతలు, మంత్రులు మాట్లాడుతున్న తీరేనని దీనంటికి కారణమని తేలింది. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఎంత అరాచకం సృష్టించారో అందరికీ తెలుసు. ఇప్పుడు అతను ఎమ్మెల్సీ కూడా అవుతున్నారు.అయితే ఇలాంటి అరాచకాలు సృష్టించే నేతలకు పదవులు ఇవ్వడాన్ని ప్రజాస్వామ్యం ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో ‘‘పంచాయతీ ఎన్నికలకు అడ్డూ అదుపూ లేదా?. ఎన్నికలయిపోయాక కూడా హింస ఎందుకు కొనసాగుతోంది?. ప్రతిపక్షాల కార్యకర్తలు బలవంతపు చావులకు ఎందుకు పాల్పడుతున్నారు?. అరాచక వాధులకు జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తారా?. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ఇంకా ఎన్ని అరాచకాలు చూడాలి?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 


Updated Date - 2021-02-26T01:48:27+05:30 IST