శ్రీకాకుళం జిల్లా: పంచాయతీ సర్పంచ్‌ల వినూత్న నిరసన

ABN , First Publish Date - 2022-04-05T18:29:02+05:30 IST

శ్రీకాకుళం జిల్లా: పంచాయతీ సర్పంచ్‌లు వినూత్న నిరసన చేపట్టారు.

శ్రీకాకుళం జిల్లా: పంచాయతీ సర్పంచ్‌ల వినూత్న నిరసన

శ్రీకాకుళం జిల్లా: పంచాయతీ సర్పంచ్‌లు వినూత్న నిరసన చేపట్టారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా భిక్షాటన చేశారు. 14, 15 ఆర్థిక సంఘం నిధులతోపాటు జనరల్ ఫండ్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖాజేయడంపై మండిపడ్డారు. గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసి సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. నిధులను పంచాయతీ అకౌంట్‌లో వేయాలని, గ్రామాల అభివృద్ధికి సహకరించాలని సర్పంచ్‌లు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా పంచాయతీ నిధులను వెనక్కి తీసుకోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2022-04-05T18:29:02+05:30 IST