కాకినాడలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు.. ఓటిఎస్ కట్టాలంటూ బెదరింపులు

ABN , First Publish Date - 2021-12-27T19:10:28+05:30 IST

ఏపీలో ఓటీఎస్ మంటలు చెలరేగుతున్నాయి. ఒకవైపు స్వచ్చంధమేనని ప్రభుత్వం చెబుతున్నా..

కాకినాడలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు.. ఓటిఎస్ కట్టాలంటూ బెదరింపులు

కాకినాడ: ఏపీలో ఓటీఎస్ మంటలు చెలరేగుతున్నాయి. ఒకవైపు స్వచ్చంధమేనని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఓటీఎస్ కట్టాలంటూ వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ఓటీఎస్ కట్టకపోతే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు.


కాకినాడలో వైసీపీ కార్యకర్తలు, వాలంటీర్లు బెదిరిస్తున్న వైనంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ఇచ్చిన పథకాలన్నీ తీసుకుంటున్నారని.. మాజీ సీఎం రాజశేఖర్ ఇచ్చిన ఇంటికి రూ. 15వేలు కట్టమంటే నొప్పేంటని వార్నింగులు ఇస్తున్నారు. బలవంతంగా ఓటీఎస్ వసూళ్లు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎప్పుడో కట్టిన ఇళ్లకు.. ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం ఎంటని మండిపడుతున్నారు.

Updated Date - 2021-12-27T19:10:28+05:30 IST