చంద్రబాబుకు రజనీకాంత్‌ ఫోన్‌

ABN , First Publish Date - 2021-11-21T08:04:12+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబును తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పరామర్శించారు. ....

చంద్రబాబుకు రజనీకాంత్‌ ఫోన్‌

అసెంబ్లీ ఘటనలపై విచారం 

వ్యక్తిగత దూషణలు బాధాకరం: మైత్రేయన్‌

అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబును తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పరామర్శించారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనల ను మీడియా ద్వారా తెలుసుకున్న రజనీకాంత్‌ శనివా రం ఉదయం చంద్రబాబుకు ఫోన్‌ చేసి విచారం వ్యక్తం చేశారు. మరోవైపు అన్నాడీఎంకే పార్టీ సీనియర్‌ నేత మైత్రేయన్‌ కూడా చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. అనంతరం, ‘నాకు 1984 నుంచి ఎన్టీఆర్‌ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ కుమార్తె భువనేశ్వరిపై అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు చేశారని విని బాధపడ్డాను. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబుకు  ఫోన్‌ చేసి మాట్లాడాను’ అని మైత్రేయన్‌ ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2021-11-21T08:04:12+05:30 IST