అదానీ, అంబానీకి ప్రభుత్వ ఆస్తులు: సీపీఐ
ABN , First Publish Date - 2021-09-18T09:47:57+05:30 IST
అదానీ, అంబానీకి ప్రభుత్వ ఆస్తులు: సీపీఐ
తిరుపతి (కల్చరల్), సెప్టెంబరు 17: గుజరాత్కు చెందిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా అదే రాష్ట్రానికి చెందిన అదానీ, అంబానీలకు ఆస్తులు సమకూర్చడమే ప్రధాన అజెండాగా పనిచేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ప్రభుత్వరంగ ఆస్తులను అప్పనంగా అమ్మేస్తున్నారని, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, పోర్టులు, జాతీయ రహదారులనూ వారికే అప్పగిస్తున్నారని విమర్శించారు.